UPI: నో యూపీఐ... ఓన్లీ క్యాష్

UPI: నో యూపీఐ... ఓన్లీ క్యాష్
X
దేశవ్యాప్తంగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు... చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు... ఓ వ్యక్తికి రూ.29 లక్షల కట్టాలని నోటీసులు

ఒక­ప్పు­డు మనం ఎక్క­డ­కు వె­ళ్లి­నా డబ్బు­లు పె­ట్టు­కు­ని వె­ళ్లే­వా­ళ్లం. లే­దం­టే డె­బి­ట్ కా­ర్డు పె­ట్టు­కు­ని.. దగ్గ­ర­లో ఉన్న ఏటీ­ఎం­లో డబ్బు­లు విత్ డ్రా చే­సు­కు­నే­వా­ళ్లం. కానీ, ఇప్పు­డు చే­తి­లో స్మా­ర్ట్‌­ఫో­న్ ఉంటే చాలు ఎన్ని రకాల పే­మెం­ట్లు అయి­నా చే­సే­స్తు­న్నాం. ఛాయ్ తా­గా­ల­న్నా.. షా­ప్‌­కు వె­ళ్లి పాల ప్యా­కె­ట్, ఇతర ఏ వస్తు­వు­లు కొ­న్నా.. రో­డ్డు పక్కన కూ­ర­గా­య­లు కొ­ను­గో­లు చే­సిన యూ­పీఐ స్కా­న్ చేసి డబ్బు­లు చె­ల్లి­స్తుం­టాం. చి­వ­రి­కి ఆర్టీ­సీ బస్సు ఎక్కి­నా.. చి­ల్లర సమ­స్య లే­కుం­డా యూ­పీఐ స్కా­న్ చేసి టి­కె­ట్ కొం­టు­న్నాం. రూ.1 నుం­చి రూ.లక్ష వరకు ఒకే­సా­రి ఫోన్ పే, గూ­గు­ల్ పే, పే­టీ­ఎం సహా ఇతర పే­మెం­ట్ యా­ప్‌­ల­ను ఉప­యో­గిం­చి క్ష­ణా­ల్లో చె­ల్లిం­పు­లు చే­స్తు­న్నాం. అయి­తే, ఇప్పు­డు వ్యా­పా­రు­లు యూ­పీఐ పే­మెం­ట్లు వద్ద­ని చె­బు­తు­న్నా­రు.

డిజిటల్ చెల్లింపులపై వ్యతిరేకత

గత కొ­న్ని రో­జు­లు­గా కర్ణా­ట­క­లో డి­జి­ట­ల్ చె­ల్లిం­పు­ల­పై తీ­వ్ర వ్య­తి­రే­కత వ్య­క్త­మ­వు­తోం­ది. బెం­గ­ళూ­రు నగ­రం­లో రో­డ్డు పక్కన బం­డ్లు, ఫుడ్ కో­ర్ట్‌­లు, స్థా­నిక షా­పు­ల్లో 'నో యూ­పీఐ, ఓన్లీ క్యా­ష్' అంటూ కొ­త్త­గా బో­ర్డు­లు దర్శ­న­మి­స్తు­న్నా­యి. తమ వద్ద ఏది కొ­న్నా దా­ని­కి నే­రు­గా డబ్బు­లే చె­ల్లిం­చా­ల­ని.. యూ­పీఐ పే­మెం­ట్ల­ను అం­గీ­క­రిం­చే­ది లే­ద­ని వ్యా­పా­రు­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. ఇక డి­జి­ట­ల్ పే­మెం­ట్స్‌­కు బాగా అల­వా­టు పడి­పో­యిన జనం మా­త్రం చే­తి­లో డబ్బు­లు లేక తీ­వ్ర అవ­స్థ­లు పడు­తు­న్నా­రు. ఇటీ­వల కొం­త­మం­ది చిరు వ్యా­పా­రు­ల­కు జీ­ఎ­స్టీ నో­టీ­సు­లు రా­వ­డం­తో మి­గి­లిన వ్యా­పా­రు­లు కూడా అల­ర్ట్ అయ్యా­రు. తమకు వచ్చే యూ­పీఐ పే­మెం­ట్ల కా­ర­ణం­గా­నే.. లక్ష­ల­కు లక్ష­లు జీ­ఎ­స్టీ చె­ల్లిం­చా­ల­ని నో­టీ­సు­లు వస్తు­న్నా­యి.

చిరు వ్యాపారికి రూ.29 లక్షల నోటీసులు

కర్ణాటకలోని ఒక చిన్న కూరగాయల షాప్ నడుపుతున్న శంకరగౌడ అనే వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీసులు జారీ కావడం సంచలనం రేపింది. ఆ నోటీసులు చూసి శంకరగౌడ అవాక్కయ్యాడు. జీఎస్టీ రూల్స్ ప్రకారం.. రైతుల నుంచి కూరగాయలు నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్‌ చేయకుండా అలాగే విక్రయిస్తే.. దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు. కానీ, శంకరగౌడ విషయంలో యూపీఐ, ఇతర డిజిటల్‌ ట్రాన్సాక్షన్లను లెక్కలోకి తీసుకున్న అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. శంకరగౌడ అకౌంట్లో రూ.1.63 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వెల్లడైంది.

Tags

Next Story