కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేసిన వ్యక్తి ఇప్పుడిలా..

కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేసిన వ్యక్తి ఇప్పుడిలా..
ఎవరి అదృష్టాన్ని ఎవరు రాయగలరు..

ఎవరి అదృష్టాన్ని ఎవరు రాయగలరు.. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అన్న జాతకం బావుంది కోట్లకు పడగలెత్తాడు.. తమ్ముడు అప్పుల్లో కూరుకుపోయాడు. ప్రపంచంలోని రిచెస్ట్ స్టీల్ మ్యాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ తమ్ముడు ప్రమోద్ మిట్టల్ దివాలా తీశారు. భారీ అప్పుతో సతమతమవుతున్నారు. ఏకంగా 2.5 బిలియన్ పౌండ్ల అప్పు.. మన కరెన్సీలో అయితే రూ.24 వేల కోట్లు. తండ్రికి 170 మిలియన్ పౌండ్లు, కొడుకు దివేశ్‌కు 2.4 మిలియన్ పౌండ్లు, భార్య సంగీతకు 1.1 మిలయన్ పౌండ్లు, బావ అమిత్ లోహియాకు 1.1 మిలియన్ పౌండ్లు అప్పు ఉన్నారు. ప్రమోద్‌కు ఎలాంటి ఆదాయం లేదు. అయితే 66 వేల పౌండ్ల విలువైన షేర్లు, 7 వేల పౌండ్లు విలువైన జువెలరీ, 45 పౌండ్ల విలువైన ప్రాపర్టీ (భారత్‌లో) ఉంది.

2013లో కూతురు శ్రిష్టి పెళ్లికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి వార్తల్లో నిలిచారు. ప్రమోద్ మిట్టల్ 2006 నుంచి కలిసి రాలేదు. బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జీఐకేఐఎల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్స్ తరపున ప్రమోద్ గ్యారంటీ సంతకం చేశారు. అయితే జీఐకేఐఎల్ కంపెనీ మోర్గెట్ ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సిన రుణాన్ని కట్టడంలో విఫలమైంది. దీంతో మోర్గేల్ కంపెనీ 166 మిలియన్ డాలర్ల కోసం ప్రమోద్‌ను కోర్టుకు లాగింది. ప్రమోద్ ఆ డబ్బును చెల్లించలేకపోవడంతో దివాలా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story