MS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..

MS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
MS Dhoni: జెడ్ బ్లాక్ అగర్బత్తి తమ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని గురూజీ అవతార్‌లో ఉన్నారు.

MS Dhoni: జెడ్ బ్లాక్ అగర్బత్తి తమ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని గురూజీ అవతార్‌లో ఉన్నారు. ఇది పండుగల సమయం. ఇప్పుడు ప్రార్థనలు మాత్రమే వైరల్ అవుతాయి. వాటిని నిస్వార్థంగా వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది అని బ్రాండ్ తమ సందేశాన్ని భక్తులకు చేరవేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ధోని వ్యక్తిత్వం అందుకు సహాయపడుతుందని భావించి ఆయనని తమ బ్రాండ్‌కు సరైన ఎంపికగా భావించింది. జెడ్ బ్లాక్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ మాట్లాడుతూ, "జెడ్ బ్లాక్ అగరబత్తి ప్రచారంలో ధోనీ భాగం కావడం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.

"భారత మాజీ కెప్టెన్ MS ధోని ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గౌరవనీయమైన క్రికెటర్లలో ఒకడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మా అగర్బత్తి మార్కెట్‌లోకి లోతుగా చొచ్చుకుపోవడానికి ధోనీ సరైన వ్యక్తి అని మేము భావించాము" అని అంకిత్ అగర్వాల్ లాంచ్ సందర్భంగా చెప్పారు.

కంపెనీ ప్రకారం, ప్రస్తుత అగర్బత్తి మార్కెట్ రూ. 7,000 కోట్లుగా ఉంది మరియు జెడ్ బ్లాక్ దాని బ్రాండ్లు జెడ్ బ్లాక్ 3 ఇన్ 1, మంథన్ ధూప్, మంథన్ సాంబ్రాణి కప్‌లు, ఆరోగ్యం కర్పూరం, జెడ్‌తో వ్యవస్థీకృత మార్కెట్‌లో దాదాపు 20% మార్కెట్ వాటాను కలిగి ఉంది. బ్లాక్ పైనాపిల్, శ్రీఫాల్, గౌవ్డ్ సాంబ్రాణి కప్పులు, అరోమిక్స్ మరియు నేచర్ ఫ్లవర్ గోల్డ్ మరియు సియాన్ పేర్లతో మార్కెట్లో లభిస్తు్న్నాయి.

డైరెక్టర్ అన్షుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత్ మార్కెట్‌‌లో తమ ఉత్పత్తులు ప్రత్యేకించి టైర్-2, టైర్-3 నగరాల్లో బలమైన పట్టును కలిగి ఉంది. "మేము R&Dలో వినూత్న పరిమళాలు మరియు పద్ధతులతో ప్రయోగాలు చేయడంతో పాటు అనేక ప్రాంతీయ పరిమళాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాము. దీంతోపాటు పూజా సామగ్రి ఉత్పత్తులు, జెడ్ బ్లాక్ కర్పూర శ్రేణి వంటి మరిన్ని ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాము. రాబోయే పండుగల సీజన్‌తో, డిమాండ్ పెరుగుతుందని మేము భావిస్తున్నాము అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story