అవినాష్ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్

By - TV5 Telugu |2023-05-22 05:27:30.0
అవినాష్ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్ పెట్టినట్లు సమాచారం. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఢిల్లీ చేరవేస్తున్నారు. పరిణామాలపై సీబీఐ హెడ్ క్వార్టర్ సీరియస్ గా ఉన్నట్లు సీబీఐ వర్గాలు అంటున్నాయి. ప్రాధాన్యత ఉన్న కేసుల్లో ఇలా జరిగితే విశ్వాసం కోల్పోతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినాష్ విచారణను పదే పదే ఎందుకు వాయిదా వేస్తున్నారని స్థానిక అధికారులను ఢిల్లీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com