ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు.
BY Gunnesh UV28 July 2021 3:01 AM GMT

X
Gunnesh UV28 July 2021 3:01 AM GMT
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకీ జిల్లా రాంస్నేహిఘాట్ వద్ద జరిగింది. హర్యానా నుంచి కూలీలతో బీహార్ వెళ్తున్న బస్సు.. రాత్రి అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో మరమ్మతులు చేస్తుండటంతో కూలీలు కిందకు దిగి దాని ముందు నిద్రపోయారు. తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. రోడ్డుపై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్లోనే 18 మంది చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Next Story
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT