Naresh Agastya : మేఘాలు చెప్పిన ప్రేమకథ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

Naresh Agastya :  మేఘాలు చెప్పిన ప్రేమకథ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ
X

కొన్ని పాటలు వినగానే ఇన్ స్టంట్ గా ప్రేమలో పడిపోతాం. మరికొన్ని పాటలు వింటూనే ఉండిపోతాం. ఈ రెండు భావనలు కలిగేలా చేసిన పాట ఇది. మేఘాలు చెప్పిన ప్రేమకథ అనే చిత్రం నుంచి విడుదలైన ఈ సాంగ్ వినగానే ఆకట్టుకుంటోంది. విపిన్ దర్శకత్వంలో నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ నుంచి వచ్చిన రెండు టీజర్స్ కూడా అల్లరి కవిత చదివిన ఫీలింగ్ ను ఇచ్చాయనే ప్రశంసలు అందుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి జస్టిన్ ప్రభాకర్ స్వరకల్పనలో ఒక పాట విడుదలైంది. రెహమాన్ రాసిన ఈ గీతాన్ని ఎస్పీబి చరణ్, శాశా తిరుపతి కలిసి పాడారు.

‘ఒక మెరుపు మెరిసిందిపుడే చిరునవ్వుగా, ఒక చినుకు కురిసిందిపుడే సిరిమువ్వగా.. చిరుగాలిలో చిగురాకులా ఊగిందిలే ఈ ప్రాణం.. ’ అంటూ చాలా పొయొటిక్ గా మొదలైన ఈ గీతంలో మంచి సాహితీ విలువలు కనిపిస్తున్నాయి. చూస్తుంటే మాంటేజ్ సాంగ్ లానే ఉన్నా.. అప్పటి వరకూ కలిసి ఉన్నా.. ఇద్దరిలోనూ తొలిసారి ప్రేమ భావనలు మొదలైన సందర్భంగా వచ్చే గీతంలా కనిపిస్తోందా సాహిత్యం.

‘‘ఈ పూట మొదలైన ఈ హాయికి.. అంతంటూ ఉంటుంద నూరేళ్లకీ.. మాయ జరగడమే.. కాల నిర్ణయమే.. లేదు జననము లేదు మరణము ఈ మాయకే..’’ ఇలా మంచి సాహిత్యంతో ఉన్న ఈ గీతం ఈ తరానికి అంత త్వరగా కనెక్ట్ కాకపోవచ్చు కానీ.. ఓ పొగమంచు వేళ సన్నని జల్లుల్లో తడిసినంత గొప్పగా ఉందీ పాట.

Tags

Next Story