Acharya: చిరంజీవికి రెజీనాతో 'సానా కష్టం' వచ్చిందట.. అదరగొట్టిన 'ఆచార్య'

Acharya: చిరంజీవికి రెజీనాతో సానా కష్టం వచ్చిందట.. అదరగొట్టిన ఆచార్య
Acharya: మణిశర్మ సంగీత దర్శకత్వంలో వస్తున్న పాటలన్నీ చిరు, చరణ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Acharya: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తోంది. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యం కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో జోడి రామచరణ్, పూజాహెగ్డే.

మణిశర్మ సంగీత దర్శకత్వంలో వస్తున్న పాటలన్నీ చిరు, చరణ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం అనే పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఈ పాటకు చిరంజీవి, రెజీనా కసాండ్రియా చేసిన డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్.

సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసే వాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ అంటూ హుషారుగా సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. రేవంత్, గీతామాధురి ఆలపించారు. బీట్‌కి తగ్గట్టుగా చిరంజీవి వేసిన స్టెప్పులు మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి.

ఏ మాత్రం తగ్గని ఉత్సాహం, సినిమా పట్ల ఆయనుకున్న ప్యాషన్, డెడికేషన్ పాటలో స్పష్టంగా కనిపిస్తాయి. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆచార్య కోసం చిరు ఫ్యాన్స్ వెయిటింగ్.

Tags

Read MoreRead Less
Next Story