Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. విలేఖరి అడిగిన ప్రశ్నతో..

Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. విలేఖరి అడిగిన ప్రశ్నతో..
సినీ నటి సమంత శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు.

Samantha: సినీ నటి సమంత శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను సేకరించి బయటకు వస్తున్న సమయంలో ఓ విలేకరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రశ్నించారు. దాంతో ఆమె స్వామి వారి దర్శనానికి వచ్చానని, ఆలయంలో ఉన్నాని, ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడగడం భావ్యం కాదని కొంచెం మండిపడ్డారు.

సినీ నటి సమంత వచ్చిందని తెలిసి ఆమెని చూసేందుకు అభిమానులు ముచ్చటపడ్డారు. ప్రస్తుతం సమంత 'కాత్తువక్కుల రెందు కాదల్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా తెలుగులో కూడా ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సమంత సైన్ చేసినట్లు సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story