Actress Jamuna: ముగిసిన జమున అంత్య క్రియలు

Actress Jamuna: ముగిసిన జమున అంత్య క్రియలు
ఫిల్మ్ నగర్ లో అంతిమ సంస్కారాలు; దహన సంస్కారాలు నిర్వహించిన కుమార్తె స్రవంతి


సినీ నటి జమున అంత్య క్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ లో ఆవిడ అంత్య క్రియలు జరిగాయి. ఆమె కుమార్తె స్రవంతి జమునకు దహన సంస్కారాలు చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున శుక్రవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు ఉన్నా.. ఆయన రావడానికి ఆలస్యమవుతుండటంతో దహన సంస్కారాలను వారి కుమార్తె నిర్వహించారు. జమున మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

బాలకృష్ణ సంతాపం...
"అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికిమించి తెలుగు సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్నప్పటినుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్థ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాల్లోనే కాకుండా ఆరోజుల్లోనే పలు హిందీ సినిమాల్లో నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున నాన్న గారు అన్నట్లు కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈరోజున జమునగారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని బాలకృష్ణ తెలిపారు.

వారి ఆత్మకు శాంతి కలగాలి : పవన్‌కళ్యాణ్‌
"ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని పవన్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story