Rimi Sen : రూ. 4.14 కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్...

Rimi Sen :   రూ. 4.14 కోట్లు మోసపోయిన చిరంజీవి హీరోయిన్...
Rimi Sen : గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ పెట్టుబడి పేరుతో రిమీసేన్‌ను మోసం చేసినట్లుగా ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Rimi Sen : బాలీవుడ్ హీరోయిన్ రిమీసేన్‌ రూ.4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ పెట్టుబడి పేరుతో రిమీసేన్‌ను మోసం చేసినట్లుగా ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మూడేళ్ళ క్రితం అంధేరీలోని జిమ్‌లో రిమీసేన్‌కి, రౌనక్‌ తో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత అది స్నేహంగా మారింది. అయితే ఓ కొత్త కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి తన దగ్గరి నుంచి రూ. 4.14 కోట్లు తీసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. తీరా చూస్తే అసలు జతిన్‌ వ్యాస్‌ కొత్త కంపెనీని ప్రారంభించలేదని, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదని దీనితో తాను మోసపోయినట్లు గ్రహించినని తన ఫిర్యాదులో పేర్కొంది.

రిమీసేన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జతిన్‌ వ్యాస్‌పై ఐపీసీ సెక్షన్‌లు 420, 409 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా రిమీసేన్‌ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2015 లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది.

Tags

Read MoreRead Less
Next Story