Aditya 369 : 4 న ఐదు సినిమాలు వస్తున్నాయి

Aditya 369 :  4 న ఐదు సినిమాలు వస్తున్నాయి
X

మార్చి నెల టాలీవుడ్ ను బాగా నిరాశపరిచింది. దాదాపు 35 -40 సినిమాల వరకూ విడుదలయ్యాయి. వీటిలో ఊరూపేరు లేని సినిమాలే ఎక్కువగా కనిపించాయి. కనీసం పోస్టర్ వాల్యూ కూడా లేనివి చాలానే ఉన్నాయి. అయినా సక్సెస్ కు అవేం అక్కర్లేదు. కంటెంట్ ఉంటే చాలు. ఒకసారి కాకపోతే మరోసారైనా ఆకట్టుకుంటాయి. వీటిలో కంటెంట్ ఉన్నవి చాలా అంటే చాలా తక్కువ అని మార్చి టాలీవుడ్ క్యాలెండర్ ప్రూవ్ చేసింది. కేవలం రెండంటే రెండు సినిమాలే విజయాలు సాధించాయి. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్.

ఇక ఏప్రిల్ అయినా సమ్మర్ రేస్ కు ఊపునిస్తుందేమో అనుకున్నారు. మరి ఈ ఫస్ట్ వీక్ లో విడుదలవుతున్న సినిమాలు చూస్తే ఆరంభం అంత గొప్పగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పటి నుంచో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా ఈ సారి ‘శారీ’ అనే సినిమాతో వస్తున్నాడు. శారీ గాళ్ అంటూ సోషల్ మీడియాలో చూసిన ఆరాధ్య దేవి అనే అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ నిజంగానే బావుంది. బట్ వర్మను నమ్మడానికి లేదు కదా. చివరి వరకూ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది.

పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో ఆకట్టుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ 28 డిగ్రీస్ సెల్సియస్ మూవీ 4నే వస్తోంది. నవీన్ చంద్ర, శాలిని వడ్నికంటి జంటగా నటించిన సినిమా ఇది. ట్రైలర్ డిఫరెంట్ గా ఉంది.

వీరితో పాటు నటించిన శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా ఎస్పీబి చరణ్ ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ‘లవ్ యువర్ ఫాదర్’ మూవీ విడుదలవుతోంది. పవన్ కేతరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అలాగే అంతా కొత్తవాళ్లతో యేడాది క్రితమే పూర్తయిన వృషభ అనే మూవీ రిలీజ్ అవుతోంది. వృషభ ట్రైలర్ కాస్త డివోషనల్ మూవీస్ ను ఇష్టపడేవారికి నచ్చేలా ఉంది.

ఈ మూడు చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో ఒకటైన ఆదిత్య 369 రీ రిలీజ్ అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మాస్టర్ పీస్ అన్ని చిత్రాలను డామినేట్ చేస్తుందనుకుంటున్నారు. మొత్తంగా ఈ నెల 4న ఆదిత్య ౩౬౯ కాకుండా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీరిలో బాక్సాఫీస్ కరుణ ఎవరిపై ఎక్కువగా ఉంటుందో చూడాలి.

Tags

Next Story