Adivi Sesh: నెటిజన్ ట్వీట్.. రెండు గంటల్లో పరిష్కరించిన హీరో..

Adivi Sesh: నెటిజన్ ట్వీట్.. రెండు గంటల్లో పరిష్కరించిన హీరో..
Adivi Sesh: టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర ధారిగా రిలీజ్ అవుతున్న తాజా చిత్రం మేజర్..

Adavi Sesh: టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర ధారిగా రిలీజ్ అవుతున్న తాజా చిత్రం మేజర్.. 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్టన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రాన్ని శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేశారు. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలి కధానాయకుడు అడివి శేష్ కోరుకుంటున్నాడు.

అందుకే సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తానని మాట ఇచ్చారు ఆయన. అయితే ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎంలో బాల్కనీ టికెట్ ధర రూ.150 ఉండాల్సింది రూ.175కు అమ్ముతున్నారని హీరో అడివి శేష్ కి ట్వీట్ చేశాడు ఓ నెటిజన్..

అయితే అతడు ట్వీట్ చేసిన రెండు గంటల్లోనే థియేటర్ యజమానితో మాట్లాడి అడివి శేష్ ఆ సమస్యను పరిష్కరించాడు. సంధ్య థియేటర్ యాజమాన్యం రూ.150లకే టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. సాయం అందించిన థియేటర్లకు ధన్యవాదాలు తెలిపారు హీరో. ఈ సినిమా ప్రతి ఒక్కరికి చేరువవ్వాలన్నదే తన ఆకాంక్షఅని ట్వీట్ చేశారు.

జూన్ 3న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అడవి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయి మంజ్రేకర్ నటించింది. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story