Adivi Sesh : జపాన్ లో అడివి శేష్ మేజర్ స్క్రీనింగ్

Adivi Sesh :  జపాన్ లో అడివి శేష్ మేజర్ స్క్రీనింగ్
X

26/11 అటాక్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా మేజర్. సోనీ పిక్చర్స్ తో పాటు మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించాడు. శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద విజయం సాధించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీతో శేష్ దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు. చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దాడుల్లో మేజర్ సందీప్ వీరోచితంగా పోరాటం చేసి అమరుడయ్యాడు. ఆ క్లైమాక్స్ టైమ్ లో థియేటర్స్ అన్నీ కన్నీటితో తడిసిపోయాయి.

శేష్ తో పాటు సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాల, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ లో ప్రదర్శించబోతున్నారు.

ప్రస్తుతం జపాన్ అనేది ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ గా తయారైంది. అయితే ఇది కేవలం మార్కెట్ కోసం కాకుండా ఇండియన్ సినిమా కల్చర్ ను అక్కడ చూపించేందుకు కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ నెల 29న అక్కడి లోకల్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, 4 గంటల 50 నిమిషాలకు మేజర్ మూవీ స్క్రీనింగ్ కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని జపనీస్ భాషలోకి డబ్ చేయలేదు. అక్కడ జపనీస్ సబ్ టైటిల్స్ వేస్తారు. అలా ఆ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడొచ్చన్నమాట. మరి జపాన్ నుంచి మన మేజర్ కు ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.

Tags

Next Story