Aishwarya Lakshmi: గుడిలో లైంగిక వేధింపులు.. ఐశ్వర్య లక్ష్మికి ఎదురైన చేదు అనుభవం..

Aishwarya Lakshmi: ఇటీవల విడుదలైన గాడ్సే, పొన్నియిన్ సెల్వన్, మట్టి కుస్తీ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్యలక్ష్మి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మలయాళీ హీరోయిన్ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. బయట కాదు గుడిలో అన్న ఆమె మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మట్టికుస్తి సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించింది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్ సే సినిమాలో ఐశ్వర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. అలాగే, ఆమె పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నటిగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక యువకుడు తనను ఎలా లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.
''కేరళలోని ప్రముఖ దేవాలయం గురువాయూర్కు వెళ్లాం. అక్కడ అమ్మాయిగా నా అనుభవం చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్నతనంలో నా ప్రైవేట్ భాగాలను తాకిన ఒక రౌడీ యువకుడు నన్ను వేధించాడు. ఆ రోజు నేను పసుపు బట్టలు వేసుకున్నాను. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అప్పటి నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటే భయం. కానీ నాకు ఇప్పుడు భయం లేదు" అని ఐశ్వర్య లక్ష్మి తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి ఓపెన్గా చెప్పింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సంఘటనతోనే సాయిపల్లవి నటించిన గార్గి చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ఐశ్వర్య లక్ష్మి నిర్మాతగా వ్యవహరించింది. సినిమా కథలు ఎక్కడినుంచో పుట్టుకు రావు.. చాలా కథలు, మన జీవితాల్లో జరిగినవి లేదా చూసినవి, చదివినవి ఉంటాయి. ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటినుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలన్నది తెలుసుకోవాలి అని ఐశ్వర్య పేర్కొన్నారు.
విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తి సినిమాలో ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఇందులో ఆమె రెజ్లర్గా నటించింది. రొటీన్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది ఐశ్వర్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com