Aishwaryaa Rajinikanth: ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రజినీకాంత్.. అయినా బాగుందంటూ పోస్ట్..

Aishwaryaa Rajinikanth: ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రజినీకాంత్.. అయినా బాగుందంటూ పోస్ట్..
Aishwaryaa Rajinikanth: జీవితం అనేది కోవిడ్‌కు ముందు, కోవిడ్‌కు తర్వాత అన్నట్టుగా అయిపోయింది.

Aishwaryaa Rajinikanth: సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకోవడం.. వారిపై అందరి దృష్టిపడేలా చేసింది. అలా ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ పెట్టిన సెలబ్రిటీ ఐశ్వర్య రజినీకాంత్. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయినా.. ధనుష్ భార్య అయినా కూడా ఐశ్వర్య ఎక్కువగా లైమ్ లైట్‌లోకి వచ్చేది కాదు. అయితే ధనుష్‌తో విడిపోయినట్టు ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటినుండి తన సోషల్ మీడియాపై అందరి దృష్టి ఉంది.

ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే రెండుసార్లు కోవిడ్ బారినపడ్డారు. ఆ రెండుసార్లు తాను ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. ఇక పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ తన పనుల్లో బిజీ అయిపోయారు. డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో తన సత్తా చాటాలనుకుంటున్న ఐశ్వర్య.. ఇటీవల ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. అంతలోనే మరోసారి తాను ఆసుపత్రిలో చేరినట్టు ఓ పోస్ట్‌ను షేర్ చేసింది ఐశ్వర్య.

'జీవితం అనేది కోవిడ్‌కు ముందు, కోవిడ్‌కు తర్వాత అన్నట్టుగా అయిపోయింది. మరోసారి జ్వరంతో ఆసుపత్రిలో చేరాను. కానీ ఒకవేళ ఒక మంచి, అందమైన, స్ఫూర్తినిచ్చే డాక్టర్ వచ్చి మీకు వైద్యం చేస్తుంటే.. పరిస్థితి అంత దారణంగా ఏమీ అనిపించదు. మీతో కలిసి ఉమెన్స్ డే ఈవ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ప్రతికా చారి' అంటూ తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్‌తో నవ్వుతూ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐశ్వర్య.

Tags

Read MoreRead Less
Next Story