Aishwaryaa Rajinikanth : ధనుష్‌‌తో విడాకుల పై తొలిసారిగా స్పందించిన ఐశ్వర్య..!

Aishwaryaa Rajinikanth : ధనుష్‌‌తో విడాకుల పై తొలిసారిగా స్పందించిన ఐశ్వర్య..!
Aishwaryaa Rajinikanth :విడాకుల పైన ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయని, వాటిని తప్పకుండా ఎదుర్కొవాలని చెప్పింది.

Aishwaryaa Rajinikanth :టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ నాగచైతన్య, సమంత డైవర్స్‌ మ్యాటర్ ఎంత హాట్‌ టాపిక్‌ అయిందో అంతకుమించి కోలీవుడ్‌ కపుల్స్‌ ధనుష్‌, ఐశ్వర్యల బ్రేకప్‌ అంతా హాట్ టాపిక్‌‌గా మారింది. కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్స్‌‌‌గా ఓ వెలుగు వెలిగిన ఈ జంట విడిపోవడాన్ని ఇప్పటికి కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణమేంటన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. విడాకుల ప్రకటన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.. ఈ నేపధ్యంలో విడాకుల తర్వాత ఐశ్వర్య తొలిసారి మీడియాతో మాట్లాడారు.


విడాకుల పైన ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయని, వాటిని తప్పకుండా ఎదుర్కొవాలని చెప్పింది. ఏదైతే మనకి రావాలో అది తప్పకుండా వస్తుంది. ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ. వ్యక్తిగత అంశాలతో దానికి సంబంధం లేదని ఐశ్వర్య పేర్కొంది. ఎదిగే కొద్ది తనతో పాటు ప్రేమ నిర్వచనం మారుతోందని తెలిపింది. పిల్లలతో సహా అమ్మ, నాన్నలను తాను ప్రేమిస్తానంది. ప్రేమ అనేది ఏ ఒక్క వ్యక్తికి పరిమితం కాకూడదని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడ కూడా ధనుష్ పేరును ఆమె ప్రస్తావించలేదు.


ఇక ధనుష్‌, ఐశ్వర్యలకు 2004 నవంబర్‌ 18న వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా 15 ఏళ్ల యాత్ర రాజా, 11 ఏళ్ల లింగరాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అటు ధనుష్ 'సార్' మూవీ పైన ఫోకస్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో సార్.. తమిళంలో వాతి అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story