Allu Arjun : అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబోలో ‘రావణం’

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇది ప్యాన్ వరల్డ్ మూవీగా చెబుతున్నారు. ఈ టైమ్ లో ప్రశాంత్ నీల్ తో మూవీ అనేది మాగ్జిమం రూమర్ అనుకున్నారు చాలామంది. బట్.. ఇది రూమర్ కాదు. అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ ప్రశాంత్ నీల్ తోనే. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా ఓ ఈవెంట్ లో చెప్పడం విశేషం. తమ్ముడు మూవీ ప్రీ రిలీజ ఫంక్షన్ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు దిల్ రాజు. ఈ చిత్రానికి ‘రావణం’అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. టైటిల్ చూస్తే ఈ సారి కూడా ప్రశాంత్ నీల్ హీరో నెగెటివ్ అప్రోచ్ తోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అనుకోవచ్చు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోందీ చిత్రానికి. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది జూన్ 25న విడుదల చేస్తాం అని అఫీషియల్ గానే ప్రకటించారు. అటు అల్లు, అట్లీ మూవీకి కూడా అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. సో.. ఆ లోగా ప్రశాంత్ నీల్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు.
మొత్తంగా ఎన్టీఆర్ - నీల్ తర్వాత అల్లు అర్జున్ - నీల్ కాంబో ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్టే అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com