Allu Arjun: నాన్నకు వెరైటీగా వెల్‌కమ్ చెప్పిన అర్హ.. వావ్ అంటున్న నెటిజన్లు..

Allu Arjun: నాన్నకు వెరైటీగా వెల్‌కమ్ చెప్పిన అర్హ.. వావ్ అంటున్న నెటిజన్లు..
Allu Arjun: అల్లు అర్జున్ 16 రోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు

Allu Arjun: సోషల్ మీడియాలో చాలా తక్కువమంది స్టార్ల ఫ్యామిలీలు యాక్టివ్‌గా ఉంటాయి. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఒకరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన ప్రొఫెషనల్ పనుల్లో బిజీగా ఉన్నా.. తన పర్సనల్ లైఫ్ గురించి తన భార్య స్నేహ మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల తమ కూతురు అర్హ.. అల్లు అర్జున్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్.. ఇటీవల విడుదల చేసిన 'పుష్ప' సినిమా సక్సెస్‌తో ఫుల్ ఫార్మ్‌లో ఉన్నాడు. 2021 చివర్లో విడుదలయిన ఈ సినిమా.. ఆ ఏడాది విడుదలయిన అన్ని సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించి రికార్డు అందుకుంది. అయితే పుష్ప పార్ట్ 1 ఇంత సక్సెస్ అవ్వడంతో వెంటనే పుష్ప పార్ట్ 2 పనులను మొదలుపెట్టేసింది మూవీ టీమ్. ఇందుకోసమే అల్లు అర్జున్ తాజాగా దూబాయ్ వెళ్లినట్టు సమాచారం.

అల్లు అర్జున్ 16 రోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ ఔరా స్కైపూల్ దగ్గర దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఐకాన్ స్టార్. అయితే దూబాయ్ టూర్ పూర్తి చేసుకొని వచ్చిన అల్లు అర్జున్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది కూతురు అర్హ. 'వెల్‌కమ్ నాన్న' అంటూ పూలతో డెకరేట్ చేసి తండ్రికి స్వాగతం చెప్పింది. ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు అర్జున్.


Tags

Read MoreRead Less
Next Story