Keeravani : కీరవాణికి అవమానం..?

Keeravani :  కీరవాణికి అవమానం..?
X

తెలుగు సినిమా కీర్తి పతాకను ఆస్కార్ వరకూ తీసుకువెళ్లిన సంగీత దిగ్గజం కీరవాణి. అలాంటి కీరవాణికి తెలుగు సినిమా మెగాస్టార్ మూవీతో అవమానం జరిగింది. చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. విశ్వంభర.. ఈ ఇద్దరి కలయికలో 30 యేళ్ల తర్వాత వస్తోన్న సినిమా కావడం విశేషం. 1994లో వచ్చిన ఎస్పీ పరశురాం తర్వాత కీరవాణి.. చిరంజీవి సినిమాలకు సంగీతం అందించలేదు. అంతకు ముందు ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాంటి కీరవాణితో ఇన్నేళ్ల తర్వాత సినిమా చేస్తున్నప్పుడు ది బెస్ట్ అవుట్ పుట్ నే ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే విశ్వంభర బాగా లేట్ అయింది. అసలు వస్తుందా రాదా అనే డౌట్స్ కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కసారి ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో కమిట్ అయ్యాక వేరే వారిని తీసుకోవడం జరగదు. బట్ కీరవాణి విషయంలో జరుగుతోంది.

వశిష్ట డైరెక్ట్ చేసిన విశ్వంభర కోసం ఓ ఐటెమ్ సాంగ్ ను యాడ్ చేయాలనుకుంటున్నారు. ఆ పాటను కీరవాణితో కాకుండా ప్రస్తుతం మాస్ నంబర్స్ తో ఫుల ఫామ్ లో ఉన్న భీమ్స్ సిసిరోలియోతో చేయిస్తున్నారు. మరి కీరవాణి నో చెప్పాడని ఇలా చేస్తున్నారా లేక కీరవాణికి మాస్ నంబర్స్ ఇచ్చే సత్తా లేదని భీమ్స్ తీసుకున్నారా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి కీరవాణి ఖాతాలో కూడా సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. అయినా ఆయన్ని పక్కన పెట్టి మరీ భీమ్స్ తో చేయిస్తున్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ తో మూవీ టీమ్ కు ఎక్కడో గ్యాప్ వచ్చిందనే అనుకోవాలేమో. లేదా కీరవాణి చేయను అన్నాడేమో. మొత్తంగా భీమ్స్ కు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది.

Tags

Next Story