Rs.10 Cr Defamation Case : సర్జన్స్ అసోసియేషన్‌పై రెహమాన్ రూ.10 కోట్ల పరువునష్టం కేసు

Rs.10 Cr Defamation Case : సర్జన్స్ అసోసియేషన్‌పై రెహమాన్ రూ.10 కోట్ల పరువునష్టం కేసు
సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువునష్టం కేసు వేసిన ఏఆర్ రెహమాన్

AR రెహమాన్ తన చెన్నై సంగీత కచేరీ నిర్వహణలో లోపం కారణంగా సెప్టెంబరులో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత, ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఒక కచేరీ కోసం రూ. 29 లక్షలు అందుకున్నారని, కానీ ఇంకా నిర్వహించలేదని ఆరోపిస్తూ సర్జన్ల సంఘం రెహమాన్‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ అన్ని ఆరోపణలను ఖండించారు.

AR రెహమాన్ 'మరక్కుమ నెంజమ్'.. వేధింపులు, తొక్కిసలాట వంటి పరిస్థితులు, నకిలీ టిక్కెట్ల గురించి అనేక ఫిర్యాదులను చూసింది. భారీగా తరలివచ్చిన రద్దీ కారణంగా టిక్కెట్లు ఉన్నప్పటికీ చాలా మందికి ప్రవేశం నిరాకరించాల్సి వచ్చింది. ఇప్పుడు, రెహమాన్‌పై సర్జన్స్ అసోసియేషన్, ASICON ఫిర్యాదు చేయడంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదంపై సంగీత బృందం స్పందిస్తూ.. తన పరువు తీసేందుకు ప్రయత్నించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తనపై వచ్చిన ఫిర్యాదును మూడు రోజుల్లో ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాకు రెహమాన్ లీగల్ నోటీసు పంపాడు. ఈ సందర్భంగా తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఆయన ఖండించాడు. తనకు తెలియని ధర్డ్ పార్టీల ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నాడు.

ఏఆర్ రెహమాన్ ప్రతిష్టను కించపరిచినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో ఆయన అసోసియేషన్‌ను కోరారు. అంతేకాకుండా, రెహమాన్ తరపు న్యాయవాది తన పరువు తీసినందుకు గాను రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అసోసియేషన్‌ను డిమాండ్ చేశారు. సంఘం నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైతే రెహమాన్.. పలు చట్టపరమైన, క్రిమినల్ చర్యలను అనుసరించే అవకాశం ఉంది. రెహ్మాన్‌పై అసోసియేషన్.. ఆయన 2018లో రూ. 29 లక్షలు అందుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది.


Tags

Read MoreRead Less
Next Story