Bhola Shankar : 'భోళా శంకర్' వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పుపై సస్పెన్స్

Bhola Shankar : భోళా శంకర్ వివాదంపై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పుపై సస్పెన్స్
'భోళా శంకర్' వివాదంపై తీర్పు వెలువరించనున్న సిటీ సివిల్ కోర్టు

ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం తీసుకున్నారని ఆరోపిస్తూ డిస్ట్రిబ్యూటర్, బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈవివాదంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇరుపక్షాల మధ్య జరిగిన వాదోపవాదనలు ముగిశాయి. కాగా ఈ రోజు తీర్పు వెలువడనుంది.

విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) తన వద్ద రూ.30 కోట్లు తీసుకుని మోస చేశారని కోర్టుకు ఎక్కారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) స్పందిస్తూ, "ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి.. నా వద్ద నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకుని, అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వారు నన్ను మోసగించారు. మూడు రాష్ట్రాలకు కాకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందు నా డబ్బులు చెల్లిస్తామని, లెటర్ అఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కాను" అని స్పష్టం చేశారు.

ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ వారు ఇచ్చిన అండర్ టేకింగ్ లో తదుపరి సినిమా విడుదలకు ముందు బత్తుల సత్యనారాయణకు డబ్బులు ఇచ్చేస్తామని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ఈ సందర్భంగా చెప్పారు. వారి తదుపరి సినిమా భోళా శంకర్ కావడంతో, మా క్లయింటు డబ్బులు ఇచ్చేంతవరకు సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ఆ మేరకు సిటీ సివిల్ కోర్టులో ఆగస్టు 9న వాదనలు జరిగాయని, ఆగస్టు 10న తీర్పు వెలువడుతుందఅని వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story