Nagarjuna : అదీ నాగార్జున నిబద్ధత

ఏ తరానికైనా ప్రొఫెషనలిజం అనేది ఇంపార్టెంట్. అప్పట్లో అలా ఉన్నారు.. ఇప్పట్లో లేరు అనే మాట తరచూ వింటుంటాం. బట్ ఏ తరం వాళ్లైనా సరే వృత్తికి గౌరవం ఇస్తేనే వారి పనికి గౌరవం వస్తుంది. అందుకే ప్రస్తుతం తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా.. నాగ్ మాత్రం తన వృత్తి ధర్మాన్ని వదల్లేదు. పెళ్లి అయిపోయినా.. తర్వాత చాలా పనులు ఉంటాయి. అయినా తన అసలు పని విషయంలో నిర్లక్ష్యం చూపించలేదు. అందుకే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన కుబేర మూవీ డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నాగ్ కు వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉందీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ తో పాటు శేఖర్ కమ్ముల, నిర్మాత కూడా స్టూడియోలో ఆయనతో పాటు కూర్చుని ఉన్నారు.

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఓ రకంగా ముందే అనుకున్న దానికంటే చాలా చాలా ఆలస్యంగా రిలీజ్ అవుతున్నా.. సినిమా ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గదు అని హామీ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అంటే తన మూవీస్ కు వచ్చే ఆడియన్స్ ఏం ఆశించి వస్తారో ఈ సారి దానికి మించి ఇవ్వబోతున్నా అని రీసెంట్ గా విడుదల చేసిన కుబేర ట్రాన్స్ తో అర్థమైంది. ఇన్నాళ్లు చేసిన సినిమాలు ఒకెత్తు.. కుబేర మరో ఎత్తు అనిపించేలా ఉంది ఆ ట్రాన్స్. మరి సినిమా అంతా అదే ట్రాన్స్ ఉంటే కుబేరతో ఈ టీమ్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com