'burn Shah Rukh Khan alive': షారుఖ్‌ని సజీవ దహనం చేస్తా..: అయోధ్య స్వామీజీ ఫైర్

burn Shah Rukh Khan alive: షారుఖ్‌ని సజీవ దహనం చేస్తా..: అయోధ్య స్వామీజీ ఫైర్
'burn Shah Rukh Khan alive': షారుఖ్ ని సజీవ దహనం చేస్తానంటూ పఠాన్ గొడవపై అయోధ్య సీయర్ పరమహంస్ ఆచార్య ఘాటుగా వ్యాఖ్యానించారు.

'burn Shah Rukh Khan alive': షారుఖ్‌ని సజీవ దహనం చేస్తానంటూ పఠాన్ గొడవపై అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించకుంటే 'జల సమాధి' చేస్తానని ప్రకటించిన పరమహంస ఆచార్య, ఇప్పుడు షారూక్‌ను సజీవ దహనం చేస్తానని చెప్పారు.



పఠాన్ చిత్రంలోని 'బేషరమ్ రంగ్' పాటపై వివాదం చల్లారలేదు. ప్రతి రోజు ఓ కొత్త వివాదం చెలరేగుతోంది ఈ పాటపై. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అయోధ్య సీయర్ పరమహంస ఆచార్య, షారూఖ్ ఖాన్‌ను ఎప్పుడైనా కలిస్తే సజీవ దహనం చేస్తానని చెప్పారు.



ఈ వీడియో వైరల్‌గా మారింది. "ఈరోజు మేము అతని పోస్టర్లను తగులబెట్టాము. పఠాన్ చిత్రం కాషాయ రంగును అవమానపరిచింది. నాకు ఎక్కడైనా షారూఖ్ ఖాన్ కనిపిస్తే, నేను అతనిని సజీవ దహనం చేస్తాను." అని ఆయన పేర్కొన్నారు.


అంతకుముందు, హనుమాన్ గర్హి పూజారి మహంత్ రాజు దాస్, పఠాన్ విడుదలయ్యే థియేటర్లను తగలబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "బాలీవుడ్, హాలీవుడ్ ఎప్పుడూ సనాతన సాంప్రదాయాలను ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తాయి. దీపికా పదుకొణె బికినీకి వాడిన రంగు మాకు బాధ కలిగిస్తుంది.


సినిమాను బహిష్కరించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా ప్రదర్శించే థియేటర్లను తగలబెట్టండి, లేకపోతే వారికి అర్థం కాదు, చెడును ఎదుర్కోవాలంటే కఠినంగా ఉండాలి తప్పదు" అని రాజు దాస్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story