Nandamuri Balarishna: ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు.. : బాలకృష్ణ ఎమోషన్

Nandamuri Balarishna: ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు.. : బాలకృష్ణ ఎమోషన్
Nandamuri Balarishna: అయితే తీర్థయాత్రలకు వస్తున్నట్లుగానే థియేటర్లకు వచ్చేశారని బాలకృష్ణ అన్నారు.

Nandamuri Balarishna: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం ఘనవిజయం సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించాడు బాలకృష్ణ. అయితే జనవరి 20కి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 50 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండగ సందర్భంగా బోయపాటి కాంబినేషన్‌పై బాలయ్యబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు 'అఖండ' పండగ అని.. కోవిడ్‌ సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని భావించి సినిమాను విడుదల చేశామని, అయితే తీర్థయాత్రలకు వస్తున్నట్లుగానే థియేటర్లకు వచ్చేశారని బాలకృష్ణ అన్నారు. ఈ 'అఖండ' పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా అని నిరూపించినందుకు ప్రేక్షకుల దేవుళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

"బోయపాటి శ్రీనుతో ఇది హ్యాట్రిక్ కాంబినేషన్. ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు. ఇది జన్మ జన్మల కలయిక. దేవుడు మనకు కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు. తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 'అఖండ' అర్ధ శతదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న గారి స్ఫూర్తితో ఈ సినిమాలో నటించాను. మంచి విజయం సాధించింది'' అని బాలయ్య అన్నారు.

ఈ భారీ చిత్రాన్ని ఓటీటీ వేదికపై చూసేందుకు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అఖండ' ఈరోజు (జనవరి 21) సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ బాణీలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Tags

Read MoreRead Less
Next Story