Bhagavanth Kesari : ఫస్ట్ లిరికల్ కు ముహూర్తం ఖరారు

Bhagavanth Kesari : ఫస్ట్ లిరికల్ కు ముహూర్తం ఖరారు
'భగవంత్ కేసరి' నుంచి క్రేజీ అప్ డేట్.. 'గణేశ్' సాంగ్ తో ఫస్ట్ లిరికల్

టాలీవుడ్ యాక్షన్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భగవంత్‌ కేసరి’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. కాగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే మ్యూజికల్‌ ప్రమోషన్స్‌కు ఆరంభించబోతున్నట్టు వార్తలు రాగా.. ఇప్పుడు సాంగ్స్ ను రిలీజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.

గణేష్ ఆంథెమ్ అనే పేరుతో రాబోతున్న ఈ సాంగ్ ప్రోమోను రేపు.. అంటే ఆగస్టు 30న సాయంత్రం 4.05నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దాంతో పాటు ఈ పాట ఫుల్ లిరికల్ ను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. 'గణ గణ గణేశా..' అంటూ ఈ సాంగ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయాలతో పాటు ఓ క్రేజీ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో బాలకృష్ణ, శ్రీలీల ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించగా.. తాజా అప్ డేట్ నందమూరి ఫ్యాన్స్ కు బూస్టప్ ఎనర్జీని అందిస్తోంది.

శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై ముందు నుంచీ ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతకుముందు బిగ్ స్క్రీన్‌పై బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూసి అక్టోబర్‌ 19న పండగ చేసుకోవడం గ్యారంటీ.. అంటూ విడుదల తేదీని తెలియజేస్తూ మేకర్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story