ఘనంగా 'భీమదేవరపల్లి' ప్రీరిలీజ్ ఫంక్షన్

'భీమదేవరపల్లి' ప్రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. మంగళవారం కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తెలంగాణ రాష్ట్ర టీవి, చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీహీరో తిరువీర్, ముఖ్య అథితులగా హాజరయ్యారు. అనేక మంది స్ధానిక నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.జూన్ 23న విడుదల కాబోతున్న భీమదేవరపల్లి బ్రాంచి చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో నటీ నటులు... అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ (బీ.ఎస్),శుభోదయం సుబ్బారావు,గడ్డం నవీన్,వివ రెడ్డి, సి ఎస్ ఆర్,నర్సింహ రెడ్డి,పద్మ,మానుకోట ప్రసాద్,తాటి గీత, విద్యా సాగర్,మహి,వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, బైరన్న, కటారి, రజిని, సుష్మా నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com