బురద స్నానం చేస్తున్న బ్యూటీ.. ఎన్ని ప్రయోజనాలో అంటూ..

బురద స్నానం చేస్తున్న బ్యూటీ.. ఎన్ని ప్రయోజనాలో అంటూ..
నటి, మోడల్ ఊర్వశి రౌతేలా ఇటీవల తాను బురద స్నానం చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నటి, మోడల్ ఊర్వశి రౌతేలా ఇటీవల తాను బురద స్నానం చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో ప్రజల దృష్టిని మరింత ఆకర్షించింది ఎందుకంటే కొంతమంది నటీమణులు అలాంటి బోల్డ్ ఫోటోలను పంచుకునే ధైర్యాన్ని చూపించలేరు. ఈ ఫోటోతో పాటు ఊర్వశి బురద స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్పారు.



ఊర్వశి రౌతేలా గ్లాస్ లాగా మెరుస్తున్న చర్మానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి బురద స్నానం. ఆమెకు సమయం దొరికినప్పుడల్లా, మట్టి స్నానం చేస్తుంటారు. ఈసారి ఊర్వశి ఎర్ర బురద స్నానం చేసింది. ఈ బురద బాలేరిక్ బీచ్ నుండి తీసుకు వచ్చింది. బాలేరిక్ దీవులు స్పెయిన్‌లో ఉన్నాయి.



ఈ మట్టిలో అనేక రకాల ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ వ్యాధులను నయం చేయడానికి దాని గ్లోను పెంచడానికి ఇది పనిచేస్తుంది. మట్టి స్నానాలు అందం పెంపొందించే పాత పద్ధతి అయినప్పటికీ దాని ప్రయోజనాలు, చర్మంపై చూపించే అద్భుత ప్రభావం కారణంగా, నేటి ఆధునిక కాలంలో కూడా మట్టి స్నాన చికిత్స కొనసాగుతోంది.

బురద స్నానం చేయడం ద్వారా, దాదాపు అన్ని రకాల చర్మ లోపాలు తొలగిపోతాయి. చర్మం హైడ్రేట్ అవుతుంది. ఊర్వశి రౌతేలా మాత్రమే కాదు, దాదాపు అందరు నటీ నటులు బురద స్నానం చేయటానికి ఇష్టపడతారు.



బురద స్నానం చేయడం వల్ల చర్మం మృదుత్వం పెరుగుతుంది. మొత్తం శరీరం రంగు మారుతుంది. డెడ్ సెల్స్ చర్మం నుండి తొలగించబడతాయి. ఈ కారణంగా కొత్త కణాలు తెరుచుకుంటాయి. దీనివల్ల చర్మం యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. బురద స్నానం అనేక చర్మ సమస్యలను తొలగిస్తుంది.



ఎక్కువ అలసిపోయిన వారు, మట్టి స్నానం చేయడం ద్వారా తక్షణ ఉపశమనం పొందుతారు. మీ కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మట్టి స్నానం మిమ్మల్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడానికి సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story