Businessman Re-release : మరోసారి థియేటర్లలోకి రానున్న 'సూర్యా భాయ్'

Businessman Re-release : మరోసారి థియేటర్లలోకి రానున్న సూర్యా భాయ్
'బిజినెస్ మేన్' రీరిలీజ్ పై కీలక ప్రకటన.. అంతా సిద్ధం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో 'బిజినెస్ మేన్' మూవీ ఒకటి. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో మరోసారి సందడి చేసేందుకు సిద్దమైంది. అంతే కాదు మేకర్స్ ఈ సినిమా రీరిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే 'పోకిరి', 'ఆరెంజ్', 'ఖుషి', 'సింహాద్రి' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ మరోసారి థియేటర్లను షేక్ చేశాయి. అదే బాటలో ఇప్పుడు మహేశ్ బాబు 'బిజినెస్ మేన్' నడుస్తోంది. ఈ సినిమా రీరిలీజ్ పై తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. 'బిజినెస్ మేన్' సినిమా ఆగస్టు 9న థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 4కె క్వాలిటీతో రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. స్పెషల్ షోలకు కూడా బాగానే రెస్పాన్స్ వస్తోంది. సూర్యా భాయ్ మరో 7రోజుల్లో మరోసారి తన మాస్ మ్యాడ్ నెస్ ను ప్రదర్శించబోతున్నారంటూ మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ ... డైలాగ్ డెలివరీ ... ఆటిట్యూడ్ అన్ని సరి కొత్తగా ఉండడంతో ఈ మూవీ తో ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ అయ్యారు. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తుండడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

ఇంతకు ముందు మహేశ్ నటించిన 'పోకిరి' కూడా కొన్ని రోజుల క్రితమే రీరిలీజ్ అయింది. ఈ సిినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య రీరిలీజ్ కు సైతం భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మళ్లీ 'పోకిరీ' హవా నడిచింది.



Tags

Read MoreRead Less
Next Story