Acharya Movie : 'ఆచార్య'లో ఆ 25 నిమిషాలు పూనకాలే..!

Acharya Movie :  ఆచార్యలో  ఆ 25 నిమిషాలు పూనకాలే..!
Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'..

Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.. కరోనా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సిద్దా అనే కీలక పాత్రలో రామ్‌‌చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే..

చిరు, చరణ్‌‌ల మధ్య సన్నివేశాలు 25 నిమిషాల పాటు ఉంటాయని, అవి మెగా అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్‌కు కూడా పూనకాలొచ్చేస్తాయని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అన్వేశ్ రెడ్డి తాజాగా తెలిపారు. ఆ 25 నిమిషాలు సిల్వర్ స్క్రీన్ మీద మెగా హీరోలను చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తుందని తెలిపారు. తాజా అప్డేట్‌‌తో మెగా ఫ్యాన్స్‌‌కి సినిమా పైన మరింత అంచనాలు పెరిగాయి. వచ్చేనెల మొదటివారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో అలరించబోతున్నారు. ఇక భోళాశంకర్, గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ లలో ప్రస్తుతం చిరు బిజీగా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story