Tollywood: ప్రమోషన్స్‌కు దూరంగా చిరంజీవి, బాలకృష్ణ..

Tollywood: ప్రమోషన్స్‌కు దూరంగా చిరంజీవి, బాలకృష్ణ..
Tollywood: చిన్న స్టార్ అయినా పెద్ద స్టార్ అయినా.. ఇప్పుడు సినిమాలకు ప్రమోషన్సే కీలకం.

Tollywood: చిన్న స్టార్ అయినా పెద్ద స్టార్ అయినా.. ఇప్పుడు సినిమాలకు ప్రమోషన్సే కీలకం.ఇక ఇండస్ట్రీని నడిపించే స్టార్స్ గా పేరున్న హీరోలు ప్రమోషన్స్ కు రాము అంటే..? ఇతర హీరోలు వారిని ఫాలో అయితే ఇంక నిర్మాతల పరిస్థితి ఏంటీ..? ప్రస్తుతం తెలుగులో ఇద్దరు టాప్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలవుతున్నాయి.



ఇప్పటికే ఈ రెండు సినిమాల మధ్య చాలా పెద్ద పోటీ ఉంది. అంచనాలూ భారీగానే ఉన్నాయి. మరోవైపు ఇద్దరు హీరోల అభిమానులకు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. పైగా రెండు సినిమాలకూ ఒకటే నిర్మాణ సంస్థ. ఇద్దరూ ఎవరికి వారు సినిమాపై అంచనాలు పెంచాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఎవరెన్ని చేసినా హీరోలు ప్రమోషన్స్ చేస్తే వచ్చే మైలేజ్ వేరు కదా..? కానీ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేందుకు ఈ ఇద్దరు హీరోలు నో చెబుతున్నారు.



ఇంతకు ముందు చిరంజీవి గాడ్ ఫాదర్ టైమ్ లో కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ వాళ్లు సెట్ చేసుకున్నవే తప్ప.. ఇతర మీడియా హౌస్ లకు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఇప్పుడు బాలయ్య కూడా అదే ఫాలో అవుతున్నాడు. టివి ఛానల్స్, పేరున్న యూ ట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కేవలం తమ టీమ్స్ తోనే సినిమా గురించిన ప్రమోషన్స్ చేయిస్తున్నారు. అలా చేయడం వల్ల కేవలం పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకుంటారు, అలాగే వాళ్లు ఏం అడగాలో కూడా టీమ్ వాళ్లే చెబుతారు. దాంతో సినిమాకు సంబంధించిన విస్తృతమైన అంశాలు డిస్కషన్ లోకి రావు.



ఇక సినిమా పోతే ఎలాగూ వీటి గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే ఏ మీడియా అయినా.. ఇలాంటి సందర్భాల్లో టాప్ స్టార్స్ తో డిస్కషన్స్ చేయడం వల్ల ఇతరులకు సాధ్యం కానివి, లేదా చాలామంది తెలుసుకోవాలనుకుంటోన్న అంశాలను గురించి అడుగుతుంది. బట్ వీళ్లు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకూ ఈ రెండు సినిమాలకు సంబంధించిన టెక్నీషియన్స్ తో మాత్రమే ప్రమోషన్స్ చేయిస్తున్నారు.



కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ తో పాటు వీర సింహారెడ్డి సినిమాటోగ్రాఫర్ మాత్రమే సినిమాకు సంబంధించిన విషయాలు చెబుతున్నారు. కానీ వీరిని పట్టించుకునేది ఎవరు..? వీరి వల్ల సినిమాకు వచ్చే మైలేజ్ ఎంత అంటే ఖచ్చితంగా పెద్దగా ఏం ఉండదు అనే చెప్పొచ్చు.



ఇక చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి ఈ నెల7 లేదా 8న వస్తారని సమాచారం. రాగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ అయిపోతే ఇక వారు చెప్పినట్టుగా ఒకటో రెండో ఇంటర్వ్యూస్ ఇస్తారు. అవే అన్ని మీడియా సంస్థలకు ఇచ్చి టెలీకాస్ట్ చేసుకోమంటారు. అందులో చూడడానికి ఆసక్తికర అంశాలు ఏవీ వుండవు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తే ప్రశ్నలు కూడా వైవిద్యంగా ఉంటాయి. చూసే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది.


ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఈ నెల 6న ఒంగోలులో వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ తర్వాత ఆయనా అంతే. ఇంటర్వ్యూస్ కామన్ గానే ఉంటాయి. తప్ప ఇండివిడ్యువల్ గా ఉండవు అంటున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీకి ఓ రూట్ మ్యాప్ సెట్ చేయాల్సిన వీళ్లు ఇలా ప్రమోషన్స్ కు మొహం చాటేయడం మాత్రం ఏం బాలేదు. ఏది ఏమైనా పెద్ద హీరోలు తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమని ఇబ్బందిలోకి నెడుతోందని చెప్పొచ్చు.


Y.J. Rambabu

Entertainment Editor

Tags

Read MoreRead Less
Next Story