Chiranjeevi: ప్రభుత్వానికి ఇదే నా విన్నపం: చిరంజీవి

Chiranjeevi (tv5news.in)
Chiranjeevi: తిరుపతిలో వరదలను చూస్తుంటే ఎక్కడో ఉన్నవారికి కూడా భయమేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో అన్న కంగారు కలుగుతోంది. తొందరగా ఆ వరదలు తగ్గిపోయి, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. గడిచిన పాతికేళ్లలో ఇలాంటి వరద భీభత్సం ఎప్పుడు కలగలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.
వరదల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ.. చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి సామాజిక సమస్యల గురించి ఆ మధ్య ఎక్కువగా తమ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే ఏపీలో వరద భీభత్సం గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని బయటపెట్టారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.
#RainFuryInTirupathi
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 19, 2021
Appeal to State Government, TTD,All Political Parties, Fans Associations & Good Samaritans to extend all possible help to restore normalcy asap. pic.twitter.com/XugKJsh1Z6
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com