Chiranjeevi: ప్రభుత్వానికి ఇదే నా విన్నపం: చిరంజీవి

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi: తిరుపతిలో వరదలను చూస్తుంటే ఎక్కడో ఉన్నవారికి కూడా భయమేస్తోంది.

Chiranjeevi: తిరుపతిలో వరదలను చూస్తుంటే ఎక్కడో ఉన్నవారికి కూడా భయమేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో అన్న కంగారు కలుగుతోంది. తొందరగా ఆ వరదలు తగ్గిపోయి, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. గడిచిన పాతికేళ్లలో ఇలాంటి వరద భీభత్సం ఎప్పుడు కలగలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

వరదల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ.. చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి సామాజిక సమస్యల గురించి ఆ మధ్య ఎక్కువగా తమ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అలాగే ఏపీలో వరద భీభత్సం గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని బయటపెట్టారు. అక్కడి ప్రజలను సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story