మెగా ఫ్యాన్స్ కు ఇక పండగే...'భోళాశంకర్' ట్రైలర్ రిలీజ్ అయ్యిందోచ్

మెగా ఫ్యాన్స్ కు ఇక పండగే...భోళాశంకర్ ట్రైలర్ రిలీజ్ అయ్యిందోచ్
'భోళాశంకర్' ట్రైలర్ రిలీజ్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ విడుదలైంది. మిల్కీ బ్యూటీ తమన్నాతో మరో సారి జత కడుతున్న చిరు.. ఈ సినిమాతో మరో మారు బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'భోళా శంకర్'.. ప్రస్తుతం ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే.. మరో పక్క ప్రమోషన్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా రివీలైన ట్రైలర్ వీడియోతో తెగ సంబరపడిపోతున్నారు.

ఇక 'భోళా శంకర్' ట్రైలర్ విషయానికొస్తే.. యాక్షన్, కామెడీ సన్నివేశాలతో మూవీ ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా.. తన చెల్లి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ను కోల్ కత్తాకు తీసుకొని వస్తాడు. అక్కడ ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్ గా జీవిస్తుంటాడు. అయితే తను కలకత్తాకు ఎందుకు వచ్చాడంటే తన తల్లిదండ్రుల చావుకు కారణమైన వారి కోసం అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి అమ్మాయిలను కిడ్నాప్ చేసే మాఫియాతో ఫైట్ చేస్తాడు. ఈ స్టోరీని మోహర్ రమేష్ కామెడీ అండ్ కమర్షియల్ గా తెరకెక్కించినట్టు ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్..' ఏ ఫీస్ట్ బిఫోర్ ది ఫెస్టివల్ టుమారో' అనే క్యాప్షన్ తో 'భోళా శంకర్ ట్రైలర్' లింక్ ను షేర్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ తో కలిసి మొదటి సారి నటించిన సాయి ధరమ్ తేజ్..'బ్రో' సినిమాతో జూలై 28 న ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ క్యాప్షన్ ను జోడించారు. అంతే కాకుండా ఈ సందర్భంగా ఆయన 'భోళా శంకర్' టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక ట్రైలర్ లో అత్యంత హీరోయిన్ తమన్నా రంగస్థలం లో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పే డైలాగ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా చిరంజీవి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇదిలా ఉండగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఆగస్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Tags

Read MoreRead Less
Next Story