Aishwarya : ధనుష్ అభిమానులకి షాకిచ్చిన ఐశ్వర్య..!

Aishwarya : ధనుష్ అభిమానులకి షాకిచ్చిన ఐశ్వర్య..!
Aishwarya : అయితే వీరిద్దరి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన సరే అది హాట్ టాపిక్‌‌గా మారుతోంది. తాజాగా వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారని వార్తలు వచ్చాయి.

Aishwarya : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చారు.. అయితే వీరిద్దరి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన సరే అది హాట్ టాపిక్‌‌గా మారుతోంది. తాజాగా వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ ప్రచారంలో నిజం లేదని ఐశ్వర్య తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య పేరు మార్చడం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో తన పేరు ఐశ్వర్య ధనుష్‌ను ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చుకుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు మార్చుకోలేదు. త్వరలోనే ఇన్‌స్టాలో కూడా ఆమె తన పేరును మార్చనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐశ్వర్య తన పూర్తి ఫోకస్ మొత్తం డైరెక్షన్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించింది. 'ఓ సాథీ చల్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసింది. హీరో, హీరోయిన్ల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story