'Em Chestunnav: గ్రాండ్ గా టీజర్ లాంఛ్ ఈవెంట్..

విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఏం చేస్తున్నావ్'. NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేస్తూ.. ఆ వేడుకను మేకర్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏం చేస్తున్నావ్ నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ఇందులో చాలా అర్థాలు ఉంటాయని, ఇది చాలా మంచి టైటిల్ అని టీజర్ కూడా బాగుందన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఈ సినిమా వేడుక చూస్తుంటే తనకు బ్రోచేవారెవరు, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయని.. కొత్త వాళ్ళందరూ ఇలానే ఎదుగుతారని వారి థాట్స్, వారి మాటలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు. అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్తవాళ్లు విజయం సాధించాలని, కొత్తవాళ్లు సక్సెస్ అయితే తనకు సంతోషమని అన్నారు. చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కొంచెం కష్టం, కానీ మీడియా సపోర్ట్ చేస్తే అదేమంత కష్టం కాదని తనకు సపోర్ట్ చేసినట్లే 'ఏం చేస్తున్నావ్' చిత్ర యూనిట్ కు కూడా మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉందని, మంచి స్టోరీ టెల్లర్ అవుతారని.. అలాగే హీరో కూడా విజయం సాధించాలని కోరుతూ ఆగస్టు 25న అందరూ తప్పకుండా థియేటర్లో ఏం చేస్తున్నావ్ చిత్రం చూడాలని టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుందని, మంచి సినిమా తీశామని శ్రీ విష్ణు చెప్పారని ఏం చేస్తున్నావ్ సినిమా డైరెక్టర్ భరత్ మిత్ర చెప్పారు. థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో వెళ్తారని తెలిపారు. ఇక ఇది నాకు ఎంతో స్పెషల్ మూమెంట్ అని పాటల రచయిత భరద్వాజ్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా బ్రోచేవారెవరు చిత్రానికి రచయితగా పనిచేయడం, మళ్ళీ ఇన్నాళ్ళకి శ్రీ విష్ణు ముఖ్యఅతిథిగా వచ్చిన ఏం చేస్తున్నావు చిత్రానికి కూడా లిరిక్స్ రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాటలు చాలా బాగున్నాయి సినిమా కూడా చాలా బాగుంటుంది అని తెలిపారు. డైరెక్టర్ భరత్ గురించి మాట్లాడుతూ... అతను షార్ట్ ఫిలిమ్స్ తీసే అప్పటినుంచి పరిచయమని, ఇద్దరూ కలిసి స్క్రిప్టులు రాసేవారన్నారు. యూట్యూబ్ లో భరత్ తీసిన 'ఇండియాస్ డాటర్' షార్ట్ ఫిలింకు అప్పట్లోనే 5 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయని, తాను చాలా మంచి డైరెక్టర్ అని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా. తన సొంత తమ్ముడు విజయ్ రాజ్ కుమార్ హీరోగా పెట్టి ఈ సినిమాను దర్శకత్వం చేయడం అనేది చాలా సంతోషంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com