Mancherial : కసాయి తండ్రి.. విలవిలలాడిన బాలుడు..

Mancherial : కసాయి తండ్రి.. విలవిలలాడిన బాలుడు..
Mancherial : కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి... కసాయిగా మారాడు.

Adilabad : కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి... కసాయిగా మారాడు. యాచించిగా వచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం.. దేవాపూర్‌లో చోటుచేసుకుంది.

దేవాపూర్ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ జల్సాలకు అలవాటు పడ్డాడు. కొడుకు షేక్ అబ్బు యాచించగా వచ్చే డబ్బుతో మద్యంతాగి జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకురాలేదన్న కారణంగా తండ్రి ఇస్మాయిల్‌... 12 ఏళ్ల షేక్ అబ్బును మూడు రోజులుగా బంధించి చిత్రహింసలు పెట్టాడు.

తాళ్లతో కట్టేసి చేతులపై వేడి నూనె పోశాడు. బాలుడి చేతికి గాయాలు కావడంతో స్థానికులు చూసి .. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో .. మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు విరాళాలు సేకరించి బాలుడికి వైద్యం చేయిస్తున్నారు.

Tags

Next Story