Guntur Kaaram: ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఎందుకంటే..

Guntur Kaaram: ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఎందుకంటే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. జనవరి 12న విడుదల కానున్న 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుందని భావించిన మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ముద్దుగుమ్మలు శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక కుర్చీ మడతపెట్టి పాటపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

తాజా సమాచారం ప్రకారం 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా పడింది. జనవరి 6న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా పోలీస్ లైన్స్‌లో 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిద్దామనుకున్న నిర్మాతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. దాంతో ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో మూవీ యూనిట్ తెలిపింది.

ఇక 'గుంటూరు కారం' సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కారణంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ప్రమోషన్స్ జోరుగా చేసే సమయం ఇది. అందులో భాగంగానే జనవరి 6న 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు నిర్మాతలు. దాంతో మహేశ్ బాబు అభిమానులు సైతం తెగ సంబరపడిపోయారు. కానీ తాజా అప్ డేట్ మహేష్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.


Tags

Next Story