సినిమా ఫ్లాప్ అయినా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు

సినిమా ఫ్లాప్ అయినా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు
ఆదిపురుష్ చూస్తున్న ప్రేక్షకుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది


ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు విమర్శిస్తుండగా మరికొందరు అభినందిస్తున్నారు. ఆ కోణంలోనే 'ఆదిపురుష్' లో సీతగా నటించిన కృతి సనన్ సినిమా చూస్తున్న ప్రేక్షకుల ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందుకుగాను పలు వీడియోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. ఆ వీడియోలలో ప్రేక్షకులు సినిమాను చూస్తూ 'జై సియా రామ్' అంటూ జయ జయ ధ్వానాలు చేశారు.


జూన్ 19, సోమవారం రోజు కృతి సనన్ ఆదిపురుష్ చూస్తున్న ప్రేక్షకుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రభాస్, కృతిసనన్ పంచుకున్న స్క్రీన్ లో, రావణునితో రాముడు జరిపిన పోరులో, ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకొస్తున్న సీన్ లలో ప్రేక్షకులు తమను తాము మరిచి చప్పట్లతో, ఈలలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కిక్కిరిసిపోయిన థియేటర్లను, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆదిపురుష్ ను చూస్తున్న తీరును కృతి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రేక్షకులు సినిమా ఆద్యంతం హర్షధ్వానాలు చేస్తూ... ఆసక్తికరమైన సన్నివేశం వచ్చినప్పుడల్లా చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కృతి ప్రజల ముందుకు తీసుకువచ్చింది. కొందరికి నచ్చకపోయినంత మాత్రాన సినిమాను ఆదరించేవారే లేరని అనుకోవడం వ్యర్ధమని అభిప్రాయపడింది. ఈ వీడియోలకు జోడీగా 'జై సియా రామ్' అని ప్రార్థనా సింబల్ ను జోడించింది.

ఓం రౌత్ దర్శకత్వం వహించి నిర్మించిన ఆదిపురుష్, ఎన్నో ఆశల మధ్య జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో సీతగా కృతి సనన్, రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. మూవీ రిలీజ్ అయిన వెంటనే ట్రోల్స్ బారిన పడింది. ముఖ్యంగా డైలాగ్ లు అమర్యాదకరంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శించారు. దానికితోడు VFX, రావణుడి కోట ఇలా ప్రతీ ఒక్కదానిపై ట్రోల్స్ విరుచుకుపడ్డాయి. విమర్శలతో పాటే సానుకూల అంశాలను ప్రజలు అక్కున చేర్చుకున్నారని కృతి సనన్ తన వీడియోల ద్వారా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story