Ashwini Puneeth : 'మా ఆయన 'జేమ్స్' సినిమా చూడలేను'.. పునీత్ రాజ్ కుమార్ భార్య

Ashwini Puneeth : మా ఆయన జేమ్స్ సినిమా చూడలేను.. పునీత్ రాజ్ కుమార్ భార్య
Ashwini Puneeth : దివగంత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ashwini Puneeth : దివగంత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పునీత్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. ప్రతి థియేటర్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో రిలీజ్ రోజున థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించారు. కర్ణాటకలోని ఏ థియేటర్‌లోనూ వారం రోజులుగా మరే ఇతర సినిమా ప్రదర్శించబడదు.

ఇక జేమ్స్ సినిమాలో కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమాని మొత్తం ఫినిష్ చేశాడు అప్పు...ఆ సన్నివేశాలను పక్కన పెట్టి సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్.. పునీత్‌‌కి డబ్బింగ్ ఆయన అన్నయ్య శివరాజ్‌‌కుమార్ చెప్పారు. చివరిసారిగా పునీత్‌ను తెరపై చూసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సినిమా చూసేందుకు లోపలికి వెళ్లి బరువెక్కిన గుండెలతో బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానుల ఏడుపు వీడియోలు కనిపిస్తున్నాయి. పునీత్ మరణం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది.

పునీత్ చివరి చిత్రం జేమ్స్ పైన ఆయన భార్య అశ్విని పునీత్ స్పందించారు. " ఇండస్ట్రీలో అన్ని రంగాల్లోనూ కొత్తవారికి చోటు కల్పించాలనేది అప్పు కల.. మా సంస్థ PRK ద్వారా ఇది కొనసాగుతుంది. మా బ్యానర్ నుండి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ కాకపోయినా మా బెస్ట్ ఇవ్వగలిగాం.. అప్పును కోల్పోయిన బాధలో ఉన్న మాకు అభిమానులు అండగా నిలిచారు. రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రమాల ద్వారా అప్పును బతికించారు. పునీత్ పుట్టినరోజును ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది జరుపుకున్నారు. ఇక 'జేమ్స్' సినిమా బాగా రూపుదిద్దుకుందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ నేను చూడలేను కాబట్టి వెళ్ళలేదు.. జేమ్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా మాట్లాడాడు'' అని అశ్విని తెలిపారు.

పునీత్ 'జేమ్స్' చిత్రాన్ని అతని కుమార్తె వందిత, వినయ్ రాజ్‌కుమార్, యువ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ మరియు మంగళ రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లతో సహా అతని కుటుంబ సభ్యులు వీక్షించారు. చేతన్ 'జేమ్స్' చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కర్ణాటకతోపాటు విదేశాల్లో కూడా విడుదలైంది.

Tags

Read MoreRead Less
Next Story