Ramya Raghupathi: నరేశ్‌కు విడాకులు ఇవ్వను.. పవిత్రను పెళ్లిచేసుకోనివ్వను: రమ్య రఘుపతి

Ramya Raghupathi: నరేశ్‌కు విడాకులు ఇవ్వను.. పవిత్రను పెళ్లిచేసుకోనివ్వను: రమ్య రఘుపతి
Ramya Raghupathi: సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరిదీ అదే దారి.. పెళ్లై పిల్లలున్నా మరొకరితో ప్రేమాయణం.. మొదటి భార్య లేక భర్తతో వైరుధ్యం..

Ramya Raghupathi: సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరిదీ అదే దారి.. పెళ్లై పిల్లలున్నా మరొకరితో ప్రేమాయణం.. మొదటి భార్య లేక భర్తతో వైరుధ్యం.. అది మరొకరి పట్ల ఆకర్షణకు దారి తీస్తుంది. అనంతరం మూడు ముళ్లు, ఏడడుగులు.. మొదటి భార్యకు విడాకులు.. సెలబ్రెటీలు ఏది చేసినా సెన్సేషనే కాబట్టి ఇప్పుడు నరేశ్, పవిత్రా లోకేష్‌ల వివాహ విషయం వార్తై కూర్చుంది.



రేపో మాపో పెళ్లిపీటలు ఎక్కుదామనుకుంటే నరేశ్ మొదటి భార్య రమ్య రఘుపతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వారి పెళ్లి వార్తపై స్పందించిన రమ్య.. చచ్చినా వాళ్ల పెళ్లి జరగనివ్వను అని అన్నారు. నరేశ్ తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని, ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉందని చెప్పారు.



నరేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఇంట్లో వాళ్లకు మా పెళ్లి ఇష్టం లేదు.. అయినా ఒప్పించి చేసుకున్నాను.. అత్తమ్మ (విజయనిర్మల) నన్ను బాగా చూసుకునే వారు.. పెళ్లైన తరువాత నరేశ్‌ అసలు రూపం తెలిసింది. ఆ విషయాలపై ఎన్నో సార్లు క్షమాపణలు చెప్పాడు.. మారతాడని ఎదురు చూస్తున్నా. ఫలితం లేకపోగా ఇప్పుడు పవిత్రను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు..


సమ్మోహనం సమయంలో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆమెను ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేస్తే ఎంతో బాగా చూసుకున్నాను. చిత్ర పరిశ్రమ ఎన్నికలు జరిగినప్పుడు వారిపై అనుమానం వచ్చింది. కొంతకాలానికి నా అనుమానం నిజమైంది. నరేశ్ వ్యవహారం నచ్చక విడాకులు ఇవ్వాలనుకున్నాను..



కానీ నా పదేళ్ల కొడుక్కి మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేదు.. నాన్నకు విడాకులు ఇవ్వొద్దు అని నా కొడుకు నానుంచి మాట తీసుకున్నాడు.. మేమిద్దరం కలిసే ఉంటామని వాడికి మాటిచ్చాను.. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.. కానీ నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను అని రమ్య స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story