Koratala Siva: పరీక్ష బాగా రాశాను.. రిజల్ట్ కోసం వెయిటింగ్: కొరటాల శివ
Koratala Siva: తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. దాదాపు 100% సక్సెస్ రేట్తో, అతను స్టార్డమ్ని పొందాడు. అతడి సక్సెస్ గ్రాఫ్ అమాంతం దూసుకుపోతోంది.. ప్రభాస్ మిర్చి తో మొదలు పెట్టి మహేష్ తో శ్రీమంతుడు, తారక్ తో జనతా గ్యారేజ్, మళ్లీ మహేష్ తో భరత్ అనే నేను చిత్రాలు తీసి సక్సెస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తారు.
శుక్రవారం విడుదలయ్యే 'ఆచార్య'తో ఐదవ హిట్ని చూడబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆచార్య' చిత్రం కోసం దాదాపు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. "ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. నా పరీక్ష పేపర్లు బాగా రాశాను. నా టీచర్ల (ప్రేక్షకుల) నుంచి ఆకట్టుకునే మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉంది'' అని కొరటాల శివ ఓ సందర్భంలో అన్నారు.
విభిన్న భావజాలం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే కారణంతో అడ్డదారులు తొక్కడం, పోరాడడం వంటి అంశాలే ఈ సినిమాలో కీలకం అని దర్శకుడు తెలిపారు. "సిద్ధ (రామ్ చరణ్) ఆశ్రమ విద్యార్థి. ఆచార్యగా నటించిన చిరంజీవి ఒక నక్సలైట్. సిద్ధ అడవులకు వెళ్లి తుపాకులు ఎందుకు పట్టుకున్నాడు, ఆచార్య అడవులను వదిలి టెంపుల్ టౌన్కి ఎందుకు వచ్చాడు అనేది ప్రాథమిక అంశం అని కొరటాల శివ వెల్లడించారు.
"కథలో మరికొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి" అవి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని శివ ఆశాభావం వ్యక్తం చేశారు. కొరటాల శివ సినిమాల్లోని బలం ఎప్పుడూ తన కథలను ఆధ్యంతం ఆసక్తికరంగా చెప్పడం. సినిమా కోసం ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ లేదా బలవంతంగా ఓ రొమాంటిక్ సన్నివేశాన్నో చేర్చాలనుకోడు. 'ఆచార్య' కూడా అదే బాటలో నడుస్తుంది. "అయితే, చిరంజీవి యొక్క స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతని అభిమానులు ఏఏ అంశాలను ఆశిస్తున్నారో నాకు తెలుసు" అని ఆయన స్పష్టం చేశారు.
కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్తో ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారల ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com