Janhvi Kapoor: ముంబై బాంద్రాలో జాన్వీ రూ. 65 కోట్ల విలువైన బంగ్లా కొనుగోలు..
Janhvi Kapoor: మిలీ స్టార్ జాన్వీ కపూర్ రూ.65 కోట్ల విలువైన డూప్లెక్స్ బంగ్లాను కొనుగోలు చేసింది. బాలీవుడ్ తారలు తరచుగా ముంబై నగరంలో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అత్యంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసి తమ స్టేటస్ను చాటుకుంటారు.
ఇక్కడ వారి స్వంత ఇల్లు ఉండాలనేది సామాన్యుల కల. తాజాగా మరో సెలబ్రిటీ జాన్వీ కపూర్ ముంబై బాంద్రాలోని అత్యంత పాష్ ఏరియాలో విలాసవంతమైన డూప్లెక్స్ బంగ్లాను కొనుగోలు చేసింది. 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసినందుకు మిలీ స్టార్ రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. జూలైలో జాన్వీ తన జుహూ ఫ్లాట్ను బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావుకు 44 కోట్ల రూపాయలకు విక్రయించింది.
జాన్వీ కపూర్ బి-టౌన్లోని స్టార్ కిడ్స్లలో ఒకరు. ఆమె ఒక్కో సినిమాతో తన ప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన మిలి చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రంపై జాన్వీ చాలా అంచనాలు పెట్టుకుంది. తండ్రి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com