K Vishwanath : కళాతపస్వి అంతిమ యాత్ర

K Vishwanath : కళాతపస్వి  అంతిమ యాత్ర
పంజాగుట్ట శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు

కళాతపస్వి కే. విశ్వనాథ్‌ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో ముగినిపోయింది. చివరి చూపులు చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో ఘనతలు సాధించడంతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్న విశ్వనాథ్... ఇక లేరనే వార్తతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. విశ్వనాథ్ పార్ధీవ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మరి కాసేపట్లో విశ్వనాథ్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. పంజాగుట్ట శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలుగు సినిమా స్థాయిని పెంచిన విశ్వనాథ్ మరణం తో ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదపులివర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయనతో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story