Kasturi Shankar: ధనుష్, ఐశ్వర్య డైవోర్స్.. కస్తూరిపై మండిపడ్డ నెటిజన్

Kasturi Shankar:  ధనుష్, ఐశ్వర్య డైవోర్స్.. కస్తూరిపై మండిపడ్డ నెటిజన్
Kasturi Shankar: ఎవరి ఇష్టం వాళ్లదే అయినా.. ఎందుకో అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటున్నారు నటి కస్తూరి.. ధనుష్, ఐశ్వర్య విడాకుల గురించి.

Kasturi Shankar: సెలబ్రిటీ జంట విడాకుల విషయం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ పెయిర్ సమంత, నాగ చైతన్యల విడాకుల సమయంలో కూడా చర్చలు హద్దులు దాటాయి. ఇప్పుడు ధనుష్ ఐశ్వర్య విడాకులపై చర్చలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

పెళ్లి వద్దు.. ప్రేమ ముద్దు అంటూ వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు నెటిజన్లు.. ఆ లెక్కన చూస్తే మీ నాన్న చేసింది కూడా తప్పేనంటావా అని వర్మని ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా మరో నటి కస్తూరి కూడా ధనుష్, ఐశ్వర్య విడాకులపై వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రులకు విడాకులు తీసుకోవడం వాళ్లకి కరెక్టే అనిపించినా.. పిల్లల విషయంలో మాత్రం అది చాలా తప్పు. అమ్మానాన్న కలిసి ఉండాలని పిల్లలు అనుకుంటారు. పిల్లలు పెద్దయ్యాక ఎవరి దారి వారు చూసుకోవడం మంచిదని కస్తూరి ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ మండిపడ్డారు. మీరు చెప్పినట్లు అలా కలిసి ఉండి.. పిల్లల ముందు రోజూ గొడవపడితే బావుంటుందా.. పిల్లల మనసుల్లో విషం నింపాలా? అని ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై కస్తూరి శంకర్ స్పందించారు. పిల్లల కోసం కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదని.. ఎప్పుడు అవసరం వచ్చినా పిల్లలకి తోడుగా ఉండాలని.. పిల్లల అవసరాలను తల్లిదండ్రులు తీర్చాలని కస్తూరి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story