Keerthy Suresh : కరోనా నుంచి కోలుకున్నాక కీర్తి సురేష్ ఎలా మారిపోయిందో చూశారా?
By - TV5 Digital Team |18 Jan 2022 2:30 PM GMT
Keerthy Suresh : తన అభిమానులకి సినీ నటి కీర్తి సురేష్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులు కరోనాతో బాధపడుతున్న ఈ మహానటి ఫేమ్.. తాజాగా కోలుకుంది.
Keerthy Suresh : తన అభిమానులకి సినీ నటి కీర్తి సురేష్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులు కరోనాతో బాధపడుతున్న ఈ మహానటి ఫేమ్.. తాజాగా కోలుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈరోజుల్లో నెగిటివ్ అనేది పాజిటివ్గా మారింది. నాపై మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత తొలిసారిగా సేల్ఫీ ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. . దీంతో కీర్తి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత వారం కీర్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భోళా శంకర్లో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com