Manisharma : ఆచార్య నుంచి మణిశర్మ అవుట్?

Manisharma : ఆచార్య నుంచి మణిశర్మ అవుట్?
Manisharma : టాలీవుడ్‌‌లో ఒకప్పుడు వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. స్టార్ హీరోలందరికీ ఈయనే ఆస్థాన సంగీత దర్శకుడు కూడా..

Manisharma : టాలీవుడ్‌‌లో ఒకప్పుడు వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. స్టార్ హీరోలందరికీ ఈయనే ఆస్థాన సంగీత దర్శకుడు కూడా.. కాలం కలిసిరాక కొద్దిరోజులు వెనకబడిపోయిన మణిశర్మకి.. మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టైం వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న మణిశర్మకి చిరంజీవి ఆచార్య మూవీ ఆఫర్ వచ్చింది. మిర్చి సినిమా నుండి భరత్ అను నేను సినిమాల వరకు దేవిశ్రీప్రసాద్ నే సంగీత దర్శకుడిగా కొనసాగించిన కొరటాల..చిరంజీవి సూచన మేరకు ఆచార్య మూవీకి మణిశర్మని మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఎంచుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లాహే లాహే మరియు నీలాంబరి, శానా కష్టం పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాకు మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ కొరటాలకు అంతగా నచ్చలేదట.. దీనితో అయనని కాదని మరో సంగీత దర్శకుడికి అ పనిని అప్పగించారని, అయితే ఆ సంగీత దర్శకుడి చేసిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ కూడా కొరటాలకి నచ్చలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఆచార్య మూవీకి బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. మరో మూడు వారాల్లో ఆచార్య విడుదల కానున్న టైంలో ఈ వార్త మెగా అభిమానులను కలవరపెడుతోంది. మణిశర్మ అంటే పాటలు కాదు.. బ్యాక్‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోర్ కూడా.. చాలా సినిమాలకి మణిశర్మ బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది కూడా.

కాగా ఏప్రిల్ 24న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని సమాచారం. మరోవైపు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌‌‌తో చేయబోతున్నారు.. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story