ఆదిపురుష్ కు అండగా కృతి సనన్ తల్లి

ఆదిపురుష్ కు అండగా కృతి సనన్ తల్లి
శబరి సమర్పించిన ఎంగిలి పళ్లను తిన్న రాముడు వాటిలోని ప్రేమను మాత్రమే చేడాలని ప్రజలకు తెలియజెప్పాడు


ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి వివాదాలలో చిక్కుకుంది. చిత్ర యునిట్ ఎంత ప్రయత్నించినా వివాదాలు మాత్రం వదలడం లేదు. తాజాగా సీతాదేవి క్యారక్టర్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తల్లి గీతా సనన్ సినిమాను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. మంచి మనస్సుతో చూస్తే ప్రతీది మంచిగా కనిపిస్తుంది. ప్రపంచం సుందరమవుతుంది. శబరి సమర్పించిన ఎంగిలి పళ్లను తిన్న రాముడు వాటిలోని ప్రేమను మాత్రమే చేడాలని ప్రజలకు తెలియజెప్పాడు. ఒక వ్యక్తి తప్పులను కాకుండా వారి భావాలను అర్థం చేసుకోవాలని ఆవిడ ట్వీట్ చేశారు.

జూన్ 16న ఆదిపురుష్ విడుదలైనప్పటినుంచి సినిమాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రామాయణం ఆధారంగా సినిమాను రూపొందించడంతో దేశవ్వాప్తంగా అపారమైన మౌత్ పబ్లిసిటీ లభించింది. అయితే ట్రైలర్ లోనే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ తేలిపోవడంతో భారీ విమర్శలను చిత్ర యునిట్ ఎదుర్కొంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆయా క్యారెక్టర్లు మాట్లాడే మాటలు, చిత్రీకరణను ప్రైక్షకులు తిరస్కరించారు. రామాయణం టీవీ సీరియల్ లో రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ ను విమర్శించారు. ఆది హాలీవుడ్ కార్టూన్ అని అన్నారు.

ఆదిపురుష్ సినిమా సాగే విధానం కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ప్రభాస్, హనుమ వేషధారి దేవ్ దత్తనాగే తప్ప మిగితావారి నటన తేలిపోయిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించగా, టీ సిరీస్, రెట్రోఫిల్స్ నిర్మించారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, దేవ్ దత్తా, సన్నీ సింగ్ తదితరులు నటించారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు.





Tags

Read MoreRead Less
Next Story