Mohanlal : ఎంపురాన్ 30ల్లో భారీ కలెక్షన్స్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన మూవీ ఎల్ 2 : ఎంపురాన్. మురళీ గోపీ కథ అందించిన సినిమా ఇది. రిలీజ్ టైమ్ లో కొన్ని విమర్శలు ఎదుర్కొందీ మూవీ. 2003లో గోద్రా అల్లర్ల నేపథ్యంలో తీసుకున్న పాత్రలకు పెట్టిన పేర్లపై కొందరు భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ పేరును తొలగించారు మేకర్స్. అయినా దర్శకుడు అయిన పృథ్వీరాజ్ పై చాలా విమర్శలే వచ్చాయి. అన్నిటినీ తిప్పి కొట్టాడు పృథ్వీరాజ్. మోహన్ లాల్ మద్దతుగా నిలవకున్నా.. పృథ్వీరాజ్ తల్లి సోషల్ మీడియా వేదికగా తన కొడుకు తప్పేం చేయలేదని అన్ని విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పింది. దీనికి బిజెపి ప్రభుత్వం ఆ చిత్ర ఫైనాన్సియర్ అయిన గోకులం గోపాలన్ ఆఫీస్ లు, ఇళ్లపై ఐటి రైడ్స్ చేయించింది. అయినా ఏం తప్పు కనిపించలేదు.
ఇక మంజు వారియర్, టోవినో థామస్, సాయి కుమార్, ఇంద్రజిత్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వచ్చాయని చెబుతోంది టీమ్. తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కలెక్షన్స్ డల్ గానే ఉన్నా.. మళయాలంతో పాటు ఇతర దేశాల నుంచి భారీ కలెక్షన్స్ వచ్చాయని ఎప్పటికప్పుడు లెక్కలతో అప్డేట్స్ ఇచ్చారు. ఫైనల్ గా ఈ మూవీ 30 రోజుల్లో ప్రపంచ వవ్యాప్తంగా 325 కోట్ల వసూళ్లు సాధించిందని చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అంటే సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ విజయం సాధించినట్టే అనుకోవాలి. ఇక త్వరలోనే ఓటిటిలోనూ స్ట్రీమ్ కాబోతోందీ మూవీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com