Lalu Prasad Yadav's Biopic : త్వరలోనే తెరపై ప్రదర్శితం కానున్న లాలూ బయోపిక్

Lalu Prasad Yadavs Biopic : త్వరలోనే తెరపై ప్రదర్శితం కానున్న లాలూ బయోపిక్
లాలూ బయోపిక్ కు సర్వం సిద్ధం.. త్వరలోనే నటీనటుల ఎంపిక

లాలూ ప్రసాద్ యాదవ్.. రాష్ట్రీయ జనతా దళ్ ప్రముఖుడు, అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ రాజకీయ నాయకులలో ఒకరు. బీహార్, జార్ఖండ్ రాజకీయాల్లో ప్రధానంగా చురుకుగా ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో కూడా తన రాజకీయ జీవితంలో ముఖ్యాంశాలుగా నిలిచాడు. ఇప్పుడు, మీడియా కథనం ప్రకారం, ప్రస్తుతం అతని జీవితం ఆధారంగా ఒక చిత్రం రూపొందుతోంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, లాలూ జీవితం ఆధారంగా ఒక చిత్రం 'నిజంగానే రాబోతోంది. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పనులు గత 5-6 నెలలుగా జరుగుతున్నాయి.

''యాదవ్ కుటుంబం నుండి స్క్రిప్ట్స్ హక్కులు తీసుకోబడ్డాయి. ప్రకాష్ ఝా ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళుతుంది. అలాగే, యాదవ్ కుమారుడు తేజస్వి ప్రసాద్ దీనికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. మూవీని ప్రారంభించడానికి కావల్సిన డబ్బు ఇప్పటికే ఇచ్చారు ”అని పలు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రం రాజకీయ నాయకుడి జీవితంలో చాలా మందికి తెలియని అంశాలను, అతని ప్రయాణం, విజయాల గురించి సమగ్ర అవగాహనను అందిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. త్వరలోనే నటీనటుల ఎంపిక జరుగుతుందని, ఇందులో హిందీ పరిశ్రమలోని నటులు భాగస్వామ్యం కానున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ గురించి ఇంటర్నెట్‌లో వార్తలు హల్ చల్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) నివేదిక ప్రకారం లాల్టెన్ అనే రాజకీయ నాయకుడి జీవితంపై బయోపిక్ ఫిబ్రవరి 2020 లో విడుదల కానుందని చెప్పింది. ఈ చిత్రంలో భోజ్‌పురి నటుడు యష్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని కూడా నివేదించబడింది.




Tags

Next Story