Mahesh Babu : నిహారికపై మహేష్ డామినేషన్

Mahesh Babu : నిహారికపై మహేష్ డామినేషన్
X

కొన్నిసార్లు అనుకోని ఇష్యూస్ అసలుకే దెబ్బేస్తాయి. లేటెస్ట్ గా తను నిర్మాతగా మారి రూపొందించిన ఫస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్లుతో హిట్ కొడదాం అనుకున్న నిహారిక ఆశలపై నీళ్లు చల్లాడు మహేష్ బాబు. నిహారిక అంతా కొత్తవాళ్లతో రూపొందంచిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. ముందు నుంచీ మంచి ప్రమోషన్స్ చేసుకున్నారు. పోస్టర్ లో తెలిసిన మొహాలు లేకపోయినా.. 11 మంది హరోలు అంటూ పొలిటికల్ సెటైర్స్ కూడా వేసుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం వెళ్లి మరీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. నిహారిక అంతా తానై ప్రమోషన్స్ ను ముందుకు నడిపించింది. చిరంజీవి నిహారికకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడియో బైట్ ఇచ్చాడు. సాయిదుర్గాతేజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లాడు. ఇంతా చేస్తే .. ఇవేం లేకుండానే కేవలం రీ రిలీజ్ అనే ట్యాగ్ తో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదలవుతుందన్న మురారి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో మురారి ఎఫెక్ట్ కమిటీ కుర్రోళ్లపై పడుతుందని అంతా ఊహించారు.

ఊహించినట్టుగానే మహేష్ బాబు మురారి ఎఫెక్ట్ నిహారిక కమిటీ కుర్రోళ్లపై బలంగా పడింది. ఫస్ట్ రోజే తమ సినిమాకు 1. 63 కోట్లు సాధించిందని ప్రకటించుకున్నా.. అటు మురారి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 5. 4 కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఒకవేళ మురారి లేకపోతే కమిటీ కుర్రోళ్ల కలెక్షన్స్ ఇంకాస్త బెటర్ గా ఉండేవి అనేది నిజం. ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు మూవీ చూస్తే కంటెంట్ వీక్ గానే ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పూర్తిగా తేలిపోయింది. విపరీతమైన జ్ఞాపకాలు గుర్తు చేశాం అని వాళ్లు చెప్పుకుంటున్నా.. చూసిన వాళ్లంతా.. ఇదేం ల్యాగ్ బాబోయ్ అని మొత్తుకుంటున్నారు. మొత్తంగా నిర్మాతగా సక్సెస్ కొట్టాలనుకున్న నిహారిక ఆశలపై మహేష్ బాబు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇక కమిటీ కుర్రోళ్లు పూర్తిగా డౌన్ అయినట్టే అంటున్నారు.

Tags

Next Story