Mahesh Babu : ఆ సంస్థతో కలిసి వ్యాపారం చేయనున్న మహేశ్బాబు

Mahesh Babu : ప్రిన్స్ మహేశ్బాబు టాలీవుడ్ హీరోగా మాత్రమే కాకుండా ఎప్పుడో బిజినెస్ మెన్ అయ్యారు. ఏఎంబీ మల్టీప్లెక్స్ స్థాపించడం.. మేజర్ లాంటి సినిమాలకు ప్రొడ్యూస్ చేయడం తెలిసింది. అయితే మరో రంగంలో కూడా మహేశ్ బిజినెస్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
రెస్టారెంట్స్లో మినర్వా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. మహేశ్ బాబు మినర్వా గ్రూపుతో కలిసి వ్యాపారం చేయనున్నారట. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో దీనికి సంబంధించిన భారీ రెస్టారెంట్ను కూడా ప్లాన్ చేశారట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది రాబోయే రోజుల్లో తెలుస్తోంది.
ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తరువాత రాజమైలి డైరక్షన్లో మరో మూవీ చేయనున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో సక్సస్ఫుల్ బిజినెస్మెన్గా ఎదుగుతున్నారు మహేశ్బాబు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com